థియేట‌ర్ల మూసివేతపై ప్రభుత్వం క్లారిటీ

థియేట‌ర్ల మూసివేతపై ప్రభుత్వం క్లారిటీ

సినిమా థియేట‌ర్లు యథావిధిగా కొన‌సాగుతాయని స్ప‌ష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. థియేట‌ర్ల య‌జామానులు సినిమా హాళ్ల‌లో కరోనా  నిబంధ‌న‌లు పాటించేలా పూర్తి స్థాయి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. థియేట‌ర్ల‌ను మూసి వేస్తారంటూ వ‌స్తోన్న ప్ర‌చారాన్ని న‌మ్మెద్దని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సూచించారు.

కొన్ని ల‌క్ష‌లాది మంది జీవితాలు సినీ ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని చెప్పారు మంత్రి తసాని. అంద‌రి ప్ర‌యోజ‌నాల‌ను, ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణ‌యాలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. అంద‌రూ క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో మళ్లీ క‌రోనా కేసులు పెరుగుండటంతో విద్యా సంస్థ‌ల‌ను బంద్ చేస్తూ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్రమంలోనే థియేట‌ర్ల‌ను కూడా బంద్ చేస్తార‌ని రూమర్స్ వ‌స్తున్నాయి. దీనిపై స్పందించిన మంత్రి త‌ల‌సాని .. థియేట‌ర్లు బంద్ చేస్తార‌న్న ప్రచారంలో నిజంలేద‌ని చెప్పారు.