హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ లేఖ రాశారు. పసుపు రైతులను ఆదుకోవాలని లేఖలో కోరారు. గత ఏడాది ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు పసుపు రైతులు నష్టపోయారని, పంట దిగుబడి తగ్గిందన్నారు. తెలంగాణలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన పసుపు రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
ముంబై సీబీఐ ఆఫీసులో కరోనా కలకలం
సభలో ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు
కొంప ముంచిన పెంపుడు శునకం బర్త్ డే పార్టీ
ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న కాల్ సెంటర్