బడ్జెట్ తీరుపై ఎంపీ బండి సంజయ్ ప్రెస్ నోట్

బడ్జెట్ తీరుపై ఎంపీ బండి సంజయ్ ప్రెస్ నోట్

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020 పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రెస్ నోట్  విడుదల చేశారు. ఈ బడ్జెట్ రాష్ట్రానికి దశదిశ చూపే బడ్జెట్ కాదని, ఇదొక రొటీన్ బడ్జెట్ అన్నారు. వాస్తవాలకు ఆమడ దూరంలో ఉన్న బడ్జెట్ ఇదని అన్నారు.

ఈ బడ్జెట్ లో.. ఉపాధి కల్పనకు కానీ వ్యవసాయ, పారిశ్రామిక వృద్ధికి కానీ కావలసిన ప్రణాళిక లేదన్నారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి ఎటువంటి పరిష్కారం చూపలేదంటూ..  ముఖ్యమంత్రి గారు హామీలిచ్చిన ఇంటికో ఉద్యోగం, లక్ష ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి వాటిని తుంగలో తొక్కి  నిరుద్యోగ యువత ఆశల పై నీళ్లు చల్లారన్నారు.

ఈ బడ్జెట్ తో బంగారు తెలంగాణ సాధ్యమా?

“2019-20 లో 1.36 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్న బడ్జెట్ లో.. ఏడాది వృద్ధి రేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసినా అంచనా వ్యయం 1.56 లక్షల కోట్లు దాటదు. మరి అలాంటప్పుడు 1.82 లక్షల కోట్ల బడ్జెట్ ను ఎలా ప్రవేశపెట్టారు? అందుకే ఇది వాస్తవాలకు దూరంగా ప్రవేశపెట్టిన బడ్జెట్” అని అన్నారు సంజయ్.

ప్రెస్ నోట్ లో.. “రాష్ట్రంలో పేరుకుపోయిన 30,000 కోట్ల పై చిలుకు బకాయిల గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావనే లేదన్నారు. బకాయిలు, సబ్సిడీలు, ఉద్యోగుల జీతాలు, కార్యాలయాల నిర్వహణ వంటి వాటికి కూడా ఈ బడ్జెట్ సరిపోదు. మరి ఈ బడ్జెట్ బంగారు తెలంగాణకు ఎలా బాటలు వేస్తుంది? . విద్య కు అరకొరగా కేవలం 6.5 శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశారు. దీనివలన ఇప్పటికే నిర్వీర్యమవుతున్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరింత దిగజారే ప్రమాదం ఉంది” అని తెలిపారు.

మరో అవకాశాన్ని టీఆర్ఎస్ చేజార్చుకుంది

రుణమాఫీ, రైతు బంధు తప్ప వ్యవసాయ అభివృద్ధికి ఈ బడ్జెట్లో పెద్దగా ఏమీ లేదు. నాలుగు విడతలుగా అమలుచేసే రుణమాఫీ వలన రైతుల రుణమాఫీ తీవ్రగా దెబ్బతింటుంది.  రెండేళ్లుగా పీఆర్ సి కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగస్తులను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచింది. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి గల ఒక మంచి అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చేజార్చుకుంది.

MP Bandi Sanjay press note on telangana state budget 2020