బైరాన్ పల్లి గ్రామాన్ని వీర బైరాన్ పల్లిగా మార్చాలి : ఎంపీ చామల

బైరాన్ పల్లి గ్రామాన్ని వీర బైరాన్ పల్లిగా మార్చాలి : ఎంపీ చామల
  • ఎంపీ చామల కిరణ్​ కుమార్​రెడ్డి 

చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలోని బైరాన్​పల్లి గ్రామాన్ని వీర బైరన్​పల్లిగా మార్చాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఎంపీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బైరాన్​పల్లిలో రజాకార్ల దాడిలో అమరులైన వారికి నివాళులర్పించి స్తూపం, బురుజు అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు చెప్పారు. 

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు బైరాన్​పల్లి గ్రామాన్ని వీర బైరాన్​పల్లి గ్రామంగా పేరు మార్చాలని కోరారన్నారు. దీంతో 1947 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో జరిగిన విషాద ఘటనను సీఎం రేవంత్ రెడ్డికి వివరించి ఊరు పేరు మార్చాలని విన్నవించినట్లు చెప్పారు.