అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ : ఎంపీ వంశీకృష్ణ

అమరవీరుల త్యాగ ఫలితమే  తెలంగాణ : ఎంపీ వంశీకృష్ణ

1500 మంది అమరవీరుల త్యాగ ఫలితమే ఈ తెలంగాణ  అని అన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ.  పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జిఎం ఆఫీస్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .  ఎంపీ వంశీకృష్ణకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు  స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన అభిమానులు

ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ వంశీ..తెలంగాణ పోరాటంలో కాకా వెంకటస్వామి కృషి మరువలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమానికి కాకా వెంకటస్వామికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు.  తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.  కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తా.  హక్కుల సాధన కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం అని వంశీ అన్నారు.

రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియాదే

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీదన్నారు ఎమ్మెల్యే వినోద్.  తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో 2024లో రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతుంది.  ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు లాంటి అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. 16 నెలల్లో నియోజకవర్గంలో నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి నిధులు పంపిణీ చేయడం జరిగింది.  భవిష్యత్తులో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తా అని అన్నారు.