
పెద్దపల్లి, వెలుగు: మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి, సమాజానికి రక్ష అని, ఇందుకోసం స్వస్త్నారీ, సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభించినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకష్ణ అన్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెద్దపల్లి సివిల్ హాస్పిటల్లో బుధవారం ఎస్ఎన్ఎస్పీఏ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
మహిళల ఆరోగ్యం రక్షణ, కుటుంబాల బలోపేతం, స్వశక్తీకరణపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని ఎంపీ పేర్కొన్నారు. సెప్టెంబర్17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వసతులను పరిశీలించారు. హాస్పిటల్సూపరింటెండెంట్ శ్రీధర్హాస్పిటల్కు అంబులెన్స్ అవసరముందని ఎంపీ దృష్టికి తీసుకురాగా.. మంజూరు చేస్తానని వంశీకృష్ణ హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంథనిలోని కాకా విగ్రహానికి ఎంపీ వంశీ పూలమాల వేసి నివాళులు అర్పించారు.
విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా పెద్దపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణకారులు ఎంపీని శాలువాలతో ఘనంగా సన్మానించారు. గతంలో స్వర్ణకార సంఘ భవన నిర్మాణానికి నిధులు సమకూర్చింది కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు.
రూ.110 కోట్లతో కుందనపల్లి రైల్వే ఫ్లై ఓవర్
గోదావరిఖని/మంథని, వెలుగు: రామగుండం–రాఘవాపూర్ స్టేషన్ల మధ్య కుందనపల్లి 49 ఎల్సీ(రైల్వే గేట్)వద్ద రూ.110 కోట్లతో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. అమృత్ భారత్ స్కీమ్ కింద రామగుండం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు. ఎంపీకి రైల్వే ఆఫీసర్లు, కాంగ్రెస్ లీడర్లు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుందనపల్లి వద్ద ఫ్లై ఓవర్నిర్మాణం ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అని అన్నారు.
రెండు నెలల్లో టెండర్ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానన్నారు. పెద్దంపేట వద్ద రైల్వే గేట్తో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నందున అక్కడ కూడా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే అంశం ప్రతిపాదనల్లో ఉందన్నారు. రామగుండంలో రూ.120 కోట్లతో ఈఎస్ఐ హాస్పిటల్ టెండర్ దశలో ఉందని, త్వరితగతిన పనులు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్షను ఆదేశించినట్టు తెలిపారు.
అనంతరం ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా గోదావరిలో పడి చనిపోయిన అక్బర్నగర్కు చెందిన రాజేశ్యాదవ్ కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. ఆయన వెంట లీడర్లు పి.మల్లికార్జున్, గుమ్మడి కుమారస్వామి, అనుమాస శ్రీనివాస్ (జీన్స్), సత్యనారాయణ, విజయ్, తిరుపతి, మధు, నరేందర్రెడ్డి, ఉన్నారు. అంతకుముందు మంథని సీవీఆర్ రిపోర్టర్ మిరియాల సాగర్ను ఆయన నివాసంలో ఎంపీ వంశీకష్ణ పరామర్శించారు.