గోదావరిఖని, వెలుగు: రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధితోపాటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. శనివారం మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయనకు రామగుండం ఎన్టీపీసీ వద్ద కాంగ్రెస్ లీడర్లు ఘన స్వాగతం పలికారు. ఐఎన్టీయూసీ నేషనల్ సీనియర్ సెక్రటరీ, ఎన్బీసీ మెంబర్బాబర్సలీంపాషా శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో లీడర్లు జావెద్, మల్లేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
