
మెహిదీపట్నం, వెలుగు: సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు, మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్టూడెంట్లు మాసబ్ ట్యాంక్ లోని తెలుగు సంక్షేమ భవన్ను మంగళవారం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. సీఎం, మంత్రులు, ఆయా శాఖల కమిషనర్లు హాస్టళ్లను సందర్శించి స్టూడెంట్ల కష్టాలను తెలుసుకోవాలన్నారు. హోటల్లో పూట భోజనం రూ.60 వరకు ఉందని, స్టూడెంట్లకు రూ.10 ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. జైల్లో ఖైదీలకు నెలకు రూ.2,100 ఇస్తూ, స్టూడెంట్లకు రూ.950 ఇవ్వడం అన్యాయమన్నారు.