కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే.. కేసీఆర్ దుకాణం ఎత్తేస్తం

కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే.. కేసీఆర్ దుకాణం ఎత్తేస్తం

కామారెడ్డి : రైతు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే ..తెలంగాణలో కేసీఆర్ దుకాణం ఎత్తేస్తామన్నారు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. సదాశివనగర్ మండలం పద్మాజీవాడి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన రేవంత్ ..రైతుల చావుకు కారణం టిఆర్ఎస్,బీజేపీ విధానాలేనన్నారు. బీజేపీ, టీఆర్ఎస్  తోడుదొంగలని.. రైతుల వెన్నెముక విరవాలని ప్రయత్నిస్తే ఢిల్లీలో కదం తొక్కారన్నారు. రైతులకు మద్దతు నిలవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ప్రభుత్వాల మెడలు వంచి రైతులను ఆదుకునేలా గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా పోరాటం ఉండాలన్నారు. నిజామాబాద్ లో కవిత దుకాణం సర్దేస్తే హైదరాబాద్ లో వచ్చి పడిందని.. ఆమెను ఎట్లా పంపినమో కేసీఆర్ ను కూడా అలాగే  పంపిస్తామన్నారు.

see more news

విషాదం.. అక్కసుతో పందెం ఎడ్లను చంపేశారు

‘మాస్టర్’ నిర్మాతకు అమెజాన్ కాసుల పంట

బీఆర్ కే భవన్ వద్ద ఉద్రిక్తత..