
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి-కునారం ఆర్వోబీ ఐరన్ గడ్డర్ విరిగిన ఘటనపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరా తీశారు. శనివారం రైల్వే ఆఫీసర్లకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన తీరుపై సమగ్ర రిపోర్ట్ సమర్పించాలని, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బ్రిడ్జి నిర్మాణ పరిస్థితిపై పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించాలని, పర్యవేక్షణ, నిర్వహణలో లోపాలు ఉన్నాయా ? అనే కోణంలో విచారణ జరపాలని సూచించారు.