మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌ మూవీ కొత్త పోస్టర్‌ రిలీజ్

మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌ మూవీ కొత్త పోస్టర్‌ రిలీజ్

రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే తొంభై శాతం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం కాశ్మీర్ వ్యాలీలో సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సేపై  బ్యూటీఫుల్ మెలోడీ డ్యూయెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని షూట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అద్భుతమైన లొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ పాట షూట్ చేస్తున్నామని,  ఆదివారంతో సాంగ్ షూట్ పూర్తయిందని మేకర్స్ తెలియజేశారు.

 ఈ పాటలోని విజువల్స్  సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రవితేజ స్టైలిష్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు.  ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో రవితేజ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు.  జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  పనోరమా స్టూడియోస్,  టి సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రమిది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.