మోదీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. 17 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)లను పెంచుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి క్వింటాలు వరికి మద్దతు ధర రూ.1940. ఇప్పుడు దాన్ని మరో వంద రూపాయలు పెంచి, రూ.2040కి చేర్చారు. ఏ గ్రేడ్ వరికి మద్దతు రూ.2060 వరకు ఇస్తామని కేంద్రం వెల్లడించింది. ఇక పెరిగిన మద్దతు ధరలు పంటలవారీగా ఇలా ఉన్నాయి. జొన్న పంట మద్దతు ధర రూ.2970కి చేరగా.. సజ్జలు రూ.2350, రాగి రూ.3578, మొక్క జొన్న రూ.1962, కందిపప్పు రూ.6600, పెసరపప్పు రూ.7755, మినప పప్పు రూ.6600, వేరుశనగ రూ.5850, ప్రొద్దుతిరుగుడు రూ.6400, సోయాబీన్ రూ.4300, నువ్వులు రూ.7830, పత్తి రూ.6080, పత్తి (పొడవు రకం) రూ.6380, నైగర్ సీడ్ మద్దతు ధర రూ.7287కి చేరాయి. ఖరీఫ్, రబీ సీజన్ లో ఎరువుల అవసరాలను తీర్చడానికి దేశంలో తగినన్ని యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. డిసెంబరు దాకా యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు తగ్గాయని, రానున్న 6 నెలల్లో వాటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. రైతులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే సరసమైన ధరలకు ఎరువులను అందుబాటులో ఉంచేలా సబ్సిడీని పెంచినట్లు వివరించారు. కాగా, కందులపై క్వింటాలుకు మద్దతు ధర రూ.300, పెసర్లపై రూ.400, పొద్దుతిరుగుడుపై రూ.385, సోయాబీన్ పై రూ.300, నువ్వులపై రూ.523 పెంచారు.
17 ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ పెంపు
- దేశం
- June 8, 2022
లేటెస్ట్
- అయోధ్య రామ్లల్లాను దర్శించుకోనున్న రాష్ట్రపతి ముర్ము
- సున్తీ కోసం ఆర్ఎంపీ దగ్గరకు వెళితే పురుషాంగం కోసేశాడు
- Baahubali Animated Series: మరో బాహుబలి వచ్చేస్తుంది..ఫ్యాన్స్కి పిచ్చెక్కించే అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం.. ఏమాత్రం నిజం లేదు.. ఖండిస్తున్నాం : సజ్జనార్
- LSG vs MI: చేతులెత్తేసిన ముంబై బ్యాటర్లు.. లక్నో ఎదుట స్వల్ప లక్ష్యం
- పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు.. గడ్డం సరోజ
- Turbo Release Date: మమ్ముట్టి టర్బో మోడ్ ముందే యాక్టివేట్..రిలీజ్ డేట్లో మార్పు
- నేను ఓడితే నేరం గెలిచినట్టే.. షర్మిల
- కేసీఆర్ స్పీచ్ను మోదీ నకల్ కొట్టిండు: సీఎం రేవంత్
Most Read News
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- కరెంట్ పోయింది.. డీఈ సస్పెండెడ్
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- పేకాట డెన్ నిర్వహిస్తున్న మహిళ.. మూడు ముక్కలాటలో లక్షల్లో లావాదేవీలు
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- టీ20 వరల్డ్ కప్ ఎంపికపై నేడు సెలెక్టర్ల భేటీ
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్
- T20 World Cup 2024: డిప్యూటీగా హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచ కప్కు భారత జట్టు ప్రకటన
- IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ