ఇల్లెందు బరిలో టీడీపీ : ముద్రగడ వంశీ

ఇల్లెందు బరిలో టీడీపీ : ముద్రగడ వంశీ

ఇల్లెందు, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఇల్లెందు బరిలో టీడీపీ ఉంటుందని పార్టీ ఇల్లెందు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ముద్రగడ వంశీ తెలిపారు. ఆదివారం పట్టణంలోని పార్టీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇల్లెందు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి టీడీపీ హయాంలో జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికే  ఆశవాహుల పేర్లను రాష్ట్ర పార్టీకి పంపించామని తెలిపారు. ఎవ్వరికి టికెట్​వచ్చినా వారిని గెలిపించుకుంటామని చెప్పారు.

సమావేశంలో ఇల్లెందు పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పనూతల రాజేందర్ గౌడ్, శ్యామ్ తీవరి, అయ్యారి నాగరాజు, కొబ్బరి శివ, మోహన్ లోద్, రాంగోపాల్ లోద్, దేశవత్ శ్రీహరి టీఎన్ఎస్ఎఫ్​ పట్టణ అధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ, వినీత్, శ్రీవేద్ పాల్గొన్నారు.