- కేపీహెచ్బీలో ముకుంద జ్యువెల్లరీ ప్రారంభోత్సవ ఆఫర్
కూకట్పల్లి, వెలుగు : తమ దగ్గర రూ.3 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కొంటే 22 క్యారెట్ల అర గ్రాము గోల్డ్కాయిన్ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ ముకుంద జ్యువెల్లరీ నిర్వాహకులు ప్రకటించారు. కేపీహెచ్బీకాలనీలో శనివారం ముకుంద పూర్వి పేరిట కొత్త షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రారంభోత్సవ ఆఫర్కింద నవంబర్1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రూ.3 లక్షల విలువైన బంగారం కొంటే అర గ్రాము విలువైన గోల్డ్కాయిన్ఇస్తామని ప్రకటించారు.
ఇన్స్టాలో ‘పూర్వీ’ ఇన్స్టా గ్రామ్పేజీ ఫాలో అయితే 5 గ్రాముల వెండి ఉచితంగా ఇస్తామన్నారు. అయితే, ఇది మొదటి మూడు రోజులే ఉంటుందని, అది కూడా వెయ్యి మందికి మాత్రమే ఉంటుందని ప్రకటించారు. సంస్థ సీఈవో నిఖితారెడ్డి, డైరెక్టర్ కృష్ణ పాల్గొన్నారు.
