హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫోకస్డ్ ఈక్విటీ పేరుతో కొత్త ఫండ్ను తీసుకొచ్చింది. ఇది మల్టీ క్యాప్ ఫండ్. గరిష్టంగా 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఓపెన్- ఎండెడ్ ఈక్విటీ పథకం పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన లాభాలను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 17న మొదలై 19న ముగుస్తుంది. సిప్ విధానంలో కనీసం రూ.2,500 ఇన్వెస్ట్ చేయాలి. లంప్సమ్ విధానంలో అయితే కనీసం రూ.ఐదు వేలు ఇన్వెస్ట్ చేయాలి.