- మెసేజ్ లు వస్తే సైబర్ పోలీసులకు కంప్లయింట్ చేయాలని కోరిన కలెక్టర్లు
ములుగు, వెలుగు : తన ప్రొఫైల్ఫొటోను ఫేక్ వాట్సప్ అకౌంట్ కు పెట్టుకుని కొందరు దుండగులు అధికారులు, ప్రజలకు మెసేజ్ లు పంపుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్సూచించారు. మంగళవారం ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. మోసగాళ్ల మెసేజ్ లను నమ్మి ఎలాంటి డబ్బులు పంపొద్దని, ఎవరైనా పంపితే వెంటనే నంబర్లను బ్లాక్ చేసి, సైబర్పోలీసులకు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్సూచించారు.
జయశంకర్ భూపాలపల్లి : సోషల్ మీడియాలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఫొటోను డీపీగా పెట్టుకుని ఫేక్ వాట్సప్ అకౌంట్ ను ఓపెన్చేశారు. ఫేక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని ఆఫీసర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. తన ఫొటోను ప్రొఫైల్ గా పెట్టుకుని కొందరు వాట్సాప్ మెసేజ్ లు పంపుతూ డబ్బులు అడుగుతున్నారని, ఇలాంటివాటిని రెస్పాండ్ కావొద్దని కోరారు. ఎవరికైనా మెసేజ్ లు వస్తే వెంటనే బ్లాక్ చేసి సైబర్ పోలీసులకు కంప్లయింట్ చేయాలని కలెక్టర్ సూచించారు.
