
నిర్మల్ జిల్లాలో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ ఇంఛార్జ్ ఆర్ఐతోపాటు బిల్ కలెక్టర్ షోయబ్లు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికారు.
నిర్మల్ మున్సిపల్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్, ఇంఛార్జ్ ఆర్ఐ సంతోష్ ఓ వ్యక్తి నుంచి రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒప్పందం కుదిర్చిన బిల్ కలెక్టర్ షోయబ్ ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..