మోడీకి మద్దతుగా ముస్లిం మహిళల ప్రచారం

మోడీకి మద్దతుగా ముస్లిం మహిళల ప్రచారం

ప్రధాని మోడీకి మద్దతుగా ముస్లిం మహిళలు ప్రచారం చేస్తున్నారు. వారణాసిలో రెండో సారి మోడీ గెలవాలని మద్దతు కూడగడుతున్నారు. ఇందుకు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. మోడీని మరోసారి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ‘మైభీ చౌకీదార్’ నినాదం రాసిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ రోడ్ షో చేశారు. దేశ భవిష్యత్ కోసం మోడీ మరోసారి ప్రధాని కావాలని ముస్లిం మహిళలు చెప్పారు.

ముస్లిం మహిళలు మోడీకి ఇస్తున్న మద్దతుకు బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. మోడీ ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ ను తీసుకొచ్చారని అది వాళ్ల జీవితంలో వెలుగును నింపిందని అన్నారు. రానున్న రోజులలో కూడా ముస్లిం మహిళలకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు బీజేపీ నాయకులు.