
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎనలేని కృషి చేస్తున్న సర్పంచ్లకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. నేషనల్ పంచాయతీ రాజ్ డే సందర్భంగా గ్రామపంచాయతీ ప్రతినిధులతో మోడీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీ రాజ్శాఖ ఎంతో కృషి చేస్తోందన్నారు. కరోనాపై ప్రజలకు మరింత అవగాహన, చైతన్యం కలిగించాలని సూచించారు. కరోనా వైరస్ ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు మోడీ. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం సర్పంచ్ లు ప్రజలలో అవగాహన పెంచాలని కోరారు. పంచాయతీ వ్యవస్థ బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. ఇప్పటి వరకూ లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనాకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల ప్రజలు… పట్టణ వాసులకు పాఠాలు నేర్పారన్నారు ప్రధాని మోడీ.