టెక్నికల్ నాలెడ్జ్ లో పట్టు ఉండాలి..వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

టెక్నికల్ నాలెడ్జ్ లో  పట్టు ఉండాలి..వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్, వెలుగు: విద్యార్థులకు టెక్నికల్​ నాలెడ్జ్​ అవసరమని వికారాబాద్​ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆధునాతన సాంకేతిక కేంద్రం(ఏటీసీ)ను ఆయన సందర్శించారు. అందులో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. లేటెస్ట్​ టెక్నాలజీలో పట్టు సాధించేలా వారిని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఐటీఐ ప్రిన్సిపాల్​ నరేంద్రబాబు, ఏటీసీ ఇన్​చార్జి ఎస్.ఎం.సరూష్ తదితరులు ఉన్నారు.