ముత్తూట్‌‌‌‌ ఫిన్‌‌‌‌కార్ప్ బాండ్లపై 9.43% వరకు వడ్డీ

ముత్తూట్‌‌‌‌  ఫిన్‌‌‌‌కార్ప్ బాండ్లపై 9.43% వరకు వడ్డీ

హైదరాబాద్​, వెలుగు:    ముత్తూట్‌‌‌‌ ఫిన్‌‌‌‌కార్ప్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌  నాన్ కన్వర్టబుల్‌‌‌‌ డిబెంచర్స్ (ఎన్‌‌‌‌సీడీ బాండ్ల) ను ఇష్యూ చేయడం ద్వారా రూ.400 కోట్ల వరకు సేకరించాలని చూస్తోంది. కంపెనీకి ఇది 16 సిరీస్‌‌‌‌ బాండ్ల ఇష్యూ.  మొదటి విడతలో రూ.100 కోట్లను సేకరిస్తారు.  ఆ తర్వాత ఈ అమౌంట్‌‌‌‌ను రూ.400 కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది. బాండ్ల ఫేస్‌‌‌‌ వాల్యూ రూ.1,000. ఈ నెల 1 నుంచి 14 మధ్య సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌ కోసం అందుబాటులో ఉంటుంది. 24, 36, 96 నెలల కాలపరిమితితో మంత్లీ, యాన్యువల్‌‌‌‌ బాండ్లను కంపెనీ ఇష్యూ చేస్తోంది. ఏడాదికి 8.65 శాతం నుంచి  9.43 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. కంపెనీ బాండ్లకు  క్రిసిల్‌‌‌‌ స్టేబుల్ రేటింగ్ ఇచ్చింది. బీఎస్‌‌‌‌ఈలోని డెట్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో ఈ బాండ్లు లిస్టింగ్ అవుతాయి.