అధికారంలో ఉండాలనే యావ ఎప్పుడూ లేదు

 అధికారంలో ఉండాలనే యావ ఎప్పుడూ లేదు

తనకు ఇప్పుడు గానీ, భవిష్యత్ లోగానీ అధికారంలో ఉండాలనే యావ లేదన్నారు ప్రధాని మోడీ. తాను దేశానికి ప్రధాన సేవకుడినని చెప్పారు. 83వ ఎడిషన్ మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ మాట్లాడారు. పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాలతో పేదల జీవితాలుమార్చామని.. అదే తన జీవితానికి చాలా పెద్ద సంతృప్తినిచ్చిందన్నారు. మరోవైపు కరోనాపై పోరాటం ముగిసిపోలేదని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు మోడీ.