అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న నవవధువు

అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు..  ఆత్మహత్య చేసుకున్న నవవధువు

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్త ఇంటి వేధింపులు తాళలేక కొత్తపెళ్లికూతురు కవిత ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డింది. నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఏడు నెలల క్రితం కాటేదాన్ నేతాజీ నగర్ కు చెందిన చంద్ర శేఖర్ తో కవితకు వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే చంద్రశేఖర్ తన అసలు రూపం బయట పెట్టాడు. అదనపు కట్నం తేవాలని కవితను మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలు పెట్టాడు. భర్తకు తోడు అత్తా, మామలతో పాటు ఆడపడుచు సూటి పొటి మాటలతో వేధించేవారు. దీంతో భర్త కుటుంబం వేధింపులు భరించలేక కవిత ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కవిత కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కవితను వేదించిన తన భర్త, అత్త, మామ, ఆడపడుచుపై 304 B సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.