తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు ఎమ్మెల్యే మైనం పల్లి హనుమంతరావు. కాసేపటి క్రితమే మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుకూల వాతావారణం ఉందన్నారు. సర్వేల ఆధారంగా అధిష్టానమే సీట్లపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. సర్వే ఫలితాల ఆధారంగానే తమకు సీట్లు ఇస్తారని చెప్పారు. ప్రజలు, క్యాడర్ తనతోనే ఉన్నారని చెప్పారు మైనంపల్లి. ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తగా పనిచేస్తానన్నారు. టీఆర్ఎస్ లో ఎంత చేయాలో అంత చేశానన్న మైనంపల్లి.. తన వర్క్ తోనే లీడర్లు గెలిచారన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది: కుంభం అనిల్
కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. తాను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లడం వల్ల క్యాడర్ కు దూరం అయ్యానని చెప్పారు. భువనగిరి ప్రజల ఆలోచనతో మళ్లీ పార్టీలోకి వచ్చానని చెప్పారు. భువనగిరిలో పార్టీ గెలుపుకోసం పనిచేస్తానన్నారు. టికెట్ కేటాయింపు అంశం అధిష్టానం చూసుకుంటుందన్నారు అనిల్.