
హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన ట్రావెల్ బ్యాగ్లో యువతి మృతదేహం కేసు మిస్టరీ వీడింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఆ ట్రావెల్ బ్యాగ్లో ఉన్న మృతదేహం నేపాల్కు చెందిన యువతిగా పోలీసుల విచారణ తేలింది. నిందితుడు నేపాల్కు చెందిన విజయ్గా పోలీసులు గుర్తించారు.
మే 23న యువతిని హత్య చేసినట్టు దర్యాప్తులో తేలింది. యువతిని హత్య చేసి ట్రావెల్ బ్యాగ్లో పెట్టినట్టు పోలీసుల నిర్ధారించారు. నిందితుడు కేపీహెచ్బీలో ఆ ట్రావెల్ బ్యాగ్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఇద్దరు గత నెలలో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చారు. బాచుపల్లిలో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ ఇద్దరూ జీవనం సాగించారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ ఆమెను హత్య చేసి ట్రావెల్ బ్యాగ్లో ప్యాక్ చేశాడు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ బాచుపల్లిలోని నిర్మానుష్య ప్రదేశంలో సూట్కేసులో ఓ యువతి డెడ్బాడీ లభ్యం కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. యువతిని అత్యంత కిరాతకంగా చంపి ట్రావెల్ బ్యాగ్లో కుక్కి బాచుపల్లి రెడ్డీస్ల్యాబ్పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన స్థానికులకు దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
డెడ్బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతిని ఎక్కడో చంపి సూట్కేస్లో కుక్కి ఇక్కడికి తెచ్చి పడేసినట్టు పోలీసులు అనుమానించారు. మహిళ మెడలో మంచానికి వాడే నైలాన్తాడు ఉండటంతో ఆమెకు ఉరివేసి చంపి ఉంటారని భావించారు. తీరా చూస్తే.. ఆమెను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిన వ్యక్తే హత్య చేసి ట్రావెల్ బ్యాగ్లో ప్యాక్ చేశాడు. బాచుపల్లిలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు.