ముషీరాబాద్/కూకట్పల్లి, వెలుగు: కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరపై రూ.200 తగ్గించడంతో దేశంలోని 33 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు ఎన్. గౌతంరావు తెలిపారు. గురువారం బర్కత్పురాలోని బీజేపీ సిటీ ఆఫీసు వద్ద ప్రధాని మోదీ ఫొటోకు ఆయన పాలాభిషేకం చేశారు.
సిలిండర్ ధర తగ్గింపు నిర్ణయంపై బీజేపీ శేరిలింగంపల్లి సెగ్మెంట్ ఇన్చార్జి గజ్జెల యోగానంద్ హర్షం వ్యక్తం చేశారు. వివేకానందనగర్ డివిజన్లో ప్రధాని మోదీ ఫొటోకు పాలాభిషేకం చేశారు.