ఇజ్రాయిల్‌పై దాడిలో బంధువులను కోల్పోయిన 'నాగిన్' నటి

ఇజ్రాయిల్‌పై దాడిలో బంధువులను కోల్పోయిన 'నాగిన్' నటి

ఇజ్రాయిల్‌పై జరుగుతున్న దాడిలో పాలస్తీనా ఉగ్రవాదులు తన కజిన్‌ సోదరి, బావను దారుణంగా హత్య చేశారని టెలివిజన్ నటి మధురా నాయక్ ఇటీవల వెల్లడించింది. దాడికి సంబంధించిన హృదయ విదారకమైన వివరాలను  ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.

మధుర తన కజిన్ సోదరి, బావ గురించి వార్తలను పంచుకుంది. ఇజ్రాయిల్‌లో తమ పిల్లల కళ్ల ముందే ఇద్దరు హత్యకు గురయ్యారని ఆమె తెలిపింది. ఇజ్రాయిల్‌లో మహిళలు, పిల్లలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని పట్టపగలు హత్యలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా మధుర తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన కజిన్ ఒడయా, ఆమె భర్త, వారి పిల్లలతో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకుంది. "ఒడయా నా సోదరి, ఆమె భర్తను పాలస్తీనా ఉగ్రవాది వారి పిల్లల ముందే దారుణంగా హత్య చేశారు. ఈ రోజు (ఆదివారం) శవమై కనిపించారు" అని ఆమె రాసుకువచ్చింది.