పదో తరగతి క్వాలిఫికేషన్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)లో గ్రూప్ పోస్టులకు అర్హులు అప్లై చేసుకోవాలని ప్రకటన ఇచ్చింది. గ్రూప్-సీ కేటగిరీలోని ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు డిసెంబరు 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నాబార్డ్ సూచించింది. ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి మెరిట్ లిస్టు ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపింది.
రిక్రూట్మెంట్ వివరాలు
పోస్టు: ఆఫీస్ అటెండెంట్
ఖాళీలు: 73
అర్హత: టెన్త్ పాస్
అప్లికేషన్ చివరి డేట్: 2020 జనవరి 12
ఆన్లైన్ ఎగ్జామ్: ఫిబ్రవరిలో
ఏజ్ లిమిట్: 2019 డిసెంబరు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసుండాలి.
ఎగ్జామ్ ఇలా..
రెండు ఫేజ్లలో పరీక్ష ఉంటుంది. 120 మార్కులకు 120 ప్రశ్నలతో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఆన్లైన్ పరీక్షకు 90 నిమిషాల టైం ఇస్తారు. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది. 150 క్వశ్చన్స్ 120 నిమిషాల టైం ఉంటుంది.
పూర్తి వివరాల కోసం నాబార్డ్ వెబ్సైట్ క్లిక్ చేయండి: https://www.nabard.org/