నాచారం పీఎస్ పరిధి మల్లాపూర్ HDFC ATM లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. HDFC బ్యాంక్ ఏటీఎంలో రూ.1000 విత్ డ్రా చేస్తే 200 రూపాయలు మాత్రమే వచ్చాయి. దీంతో విస్మయానికి గురయ్యారు వినియోగదారులు. రూ. 8 వేల నగదు విత్ డ్రా చేస్తే 600 రూపాయలు రావడంతో ఆందోళనకు గురయ్యాడు ఓ వ్యక్తి.
దీనిపై అక్కడే ఉన్న ATM టెక్నిషియన్ ను అడిగితే దురుసుగా ప్రవర్తించాడన్నారు స్థానికులు. చాలా మందికి ఇదే సమస్య ఎదురవ్వడంతో ATM దగ్గర ఆందోళనకు దిగారు కస్టమర్లు.