తమిళనాడు, ఒడిశా పర్యటనకు జేపీ నడ్డా

తమిళనాడు, ఒడిశా పర్యటనకు జేపీ నడ్డా

రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం బలహీనమైన లోక్ సభ స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 27,28వ తేదీల్లో తమిళనాడు, ఒడిశాలో పర్యటించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ పట్టు కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఒడిశాలోని కంధమాల్, పూరీ... తమిళనాడులోని నీలగిరి, కోయంబత్తూర్‭లో నడ్డా పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో మండల, బూత్ అధ్యక్షులను కలవనున్నారు. ఇతర సంస్థాగత సమావేశాలు కూడా నడ్డా షెడ్యూల్‭లో ఉన్నాయి. ఇక వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందు బలహీనంగా ఉన్న 144 లోక్ సభ స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది. అది ఇప్పుడు 160 సీట్లకు విస్తరించడంతో... బూత్ ల పటిష్టత, పార్టీ నేతల సంఖ్యను పెంచడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై బీజేపీ దృష్టి సారించింది.