జనసేన పార్టీ నాయకుడు, నరసాపురం లోక్సభ అభ్యర్థి నాగబాబు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు చేతిలో పరాజయం పొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందిన జనసేన పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఇంతవరకు తన ఖాతాను తెరవలేదు.
మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా.. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పొందారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు షాక్ లో ఉన్నారు.