అయోధ్య శ్రీరాముడికి 1,265 కేజీల లడ్డూ

అయోధ్య శ్రీరాముడికి 1,265 కేజీల లడ్డూ

సికింద్రాబాద్, వెలుగు: అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ కు చెందిన శ్రీరామ్ క్యాటరింగ్ నాగభూషణ్​ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 1,265 కేజీల అఖండ లడ్డూను తయారు చేశారు. రామ మందిర్ ఆలయ ట్రస్ట్ అనుమతితో ఈనెల 22న ఉదయం 5:40 గంటలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందులో భాగంగా బుధవారం నాగ భూషణ్ రెడ్డి  కుటుంబ సభ్యుల పూజలు చేయగా.. డీపీఎస్ విద్యాసంస్థల చైర్మన్ మల్క కొమురయ్య హాజరై పూజలు నిర్వహించారు.  శ్రీరాముని ఆశీస్సులు  ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.