ఈ మహిళా బీజేపీ నేత మిస్సింగ్.. తెరవెనక ఏం జరుగుతోంది..?

ఈ మహిళా బీజేపీ నేత మిస్సింగ్.. తెరవెనక  ఏం జరుగుతోంది..?

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన  మహిళా బీజేపీ నేత సనా ఖాన్  హఠాత్తుగా అదృశ్యం కావడం ఇప్పుడు కలకలం రేపింది.  తన బిజినెస్  పార్ట్నర్ అమిత్ అలియాస్ పప్పు సాహును కలవడానికి 2023  ఆగస్టు 1న జబల్‌పూర్ వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో  సనా ఖాన్  తల్లి మాన్కాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  మరోవైపు పప్పు సాహు కూడా కనిపించకుండా పోయాడు.  

జబల్‌పూర్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్థుడు పప్పు సాహు .. జబల్‌పూర్‌లో అతను దాబా నడుపుతున్నాడు అతనిపై హత్యతో సహా మద్యం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. అయితే ఒక నెల క్రితం సనా ఖాన్ ను చంపేస్తానంటూ ఫోన్ లో బెదిరించాడు. ఆగస్టు  1న అతని నుంచి సనాకు ఫోన్ రావడంతో జబల్‌పూర్‌కు బయలుదేరింది. అక్కడికి చేరుకున్న తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. 

ALSO READ :వరకట్న వేధింపులతో అత్తమామలపై ఫిర్యాదు చేసిన రెజ్లర్

అయితే  తిరిగి సాయంత్రం ఫోన్ చేస్తే మాత్రం  స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది.  దీంతో  ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.  సనా కోసం వెతకడానికి మహారాష్ట్ర పోలీసులు మధ్యప్రదేశ్ పోలీసుల సహాయం తీసుకున్నారు. మన్కాపూర్ పోలీసులు కూడా జబల్‌పూర్ చేరుకున్నారు.  అయితే అక్కడ కూడా సనా జాడ కనుక్కొలేకపోయారు.  ఈ కేసుకు సంబంధించి నాగపూర్  పోలీసు కమిషనరేట్‌లో  రెండు గంటల పాటు పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సనా బీజేపీ  మైనారిటీ సెల్ విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నారు.