కార్మికుల కోసం జీవితాన్ని ధారపోసిన వ్యక్తి నాయిని: మంత్రి ఎర్రబెల్లి

కార్మికుల కోసం జీవితాన్ని ధారపోసిన వ్యక్తి నాయిని: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ అర్బన్: కార్మికుల కొరకు తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. నాయిని నర్సింహారెడ్డి ఇకలేరు అన్న విషయం తెలిసిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి స్పందించారు. కార్మికుల పక్షపాతి నాయిని.. తన జీవితాంతం కార్మికుల అభివృద్ధి కోసమే పాటుపడ్డారని గుర్తు చేసుకున్నారు. మంచి నిబద్ధత గల నాయకుడు.. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి సీఎం కేసీఅర్ వెంట నడిచిన వ్యక్తి అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మొదటి హోం మంత్రిగా పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టారు.. అందరినీ తమ్మి..బాగున్నావా… అంటూ పలకరించే ఎటువంటి కల్మషం లేని వ్యక్తి నాయిని.. అలాంటి నాయకుని మృతి కార్మిక లోకానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటు.. నాయిని నర్సింహారెడ్డి  ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నా… వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నానని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.