చొప్పదండి నల్లాల్లో రంగు మారిన నీళ్లు

చొప్పదండి నల్లాల్లో రంగు మారిన నీళ్లు

చొప్పదండి, వెలుగు: చొప్పదండి పట్టణంలోని పాత వాటర్ ట్యాంక్, ఎంఈఓ ఆఫీస్ సమీపంలోని వాటర్ ట్యాంకుల నుంచి సరఫరా అవుతున్న నల్లా నీళ్లు రంగు మారి వస్తున్నాయని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. 

కొద్ది రోజులుగా మిషన్​ భగీరథ నీళ్లు మట్టితో కలుషితమై, రంగు మారి దుర్వాసన వస్తున్నాయని చెబుతున్నారు. మురికి వస్తుండడంతో జనం ఆ నీళ్లను తాగడం లేదు. ఈ నీటితో స్నానం చేస్తే దురద రావడంతోపాటు నీచు వాసన వస్తున్నాయంటున్నారు.