టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌కు నమీబియా క్వాలిఫై

టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌కు నమీబియా క్వాలిఫై

దుబాయ్‌ ‌‌‌‌‌‌‌:  వచ్చే ఏడాది జరిగే మెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌కు నమీబియా క్వాలిఫై అయింది. ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్స్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నమీబియా 58 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో టాంజానియాను ఓడించింది.  

ఆడిన ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో నెగ్గిన నమీబియా  పది పాయింట్లు, +2.643 రన్‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌తో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచి మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మిగిలుండగానే  మెగా టోర్నీ బెర్త్ దక్కించుకుందని  ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌​ (ఐసీసీ)  మంగళవారం ప్రకటించింది.  

నమీబియా వరుసగా మూడోసారి టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఆడనుంది. ఆఫ్రికా రీజియన్ నుంచి మరో బెర్తు కోసం  ఉగండా, కెన్యా, జింబాబ్వే, నైజీరియా రేసులో ఉన్నాయి. కాగా, జూన్ 4 నుంచి 30వ తేదీ వరకు వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌, యూఎస్‌‌‌‌‌‌‌‌ఏలో జరిగే టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో 20 దేశాలు పోటీ పడనున్నాయి. ఇప్పటికే 12 జట్లు క్వాలిఫై అయ్యాయి.