బీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం బీ టీం: ఫిరోజ్ఖాన్

 బీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం బీ టీం: ఫిరోజ్ఖాన్

ఆ మూడు పార్టీలూ ప్రజలను మోసం చేస్తున్నయ్​: ఫిరోజ్​ ఖాన్​

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం బీ టీం అని నాంపల్లి కాంగ్రెస్​ అభ్యర్థి ఫిరోజ్​ ఖాన్​ ఆరోపించారు. సొంత లాభం కోసం ఆ మూడు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఫైర్​అయ్యారు. కవిత ఎపిసోడ్​తో వారు కాంప్రమైజ్​అయ్యారని, రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీని గెలిపించేందుకు ఒప్పందం చేసుకున్నారన్నారు.

బుధవారం ఆయన సనత్​నగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి కోటా నీలిమతో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పుట్టిన పార్టీ ఇక్కడ 10 స్థానాల్లో కూడా పోటీ చేయట్లేదని, అలాంటిది యూపీలో వంద స్థానాల్లో పోటీ చేస్తున్నదని ఎంఐఎంను విమర్శించారు. గోషామహల్​లో రాజాసింగ్​పై ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని ఫిరోజ్​ ఖాన్ ప్రశ్నించారు. అసదుద్దీన్, కేసీఆర్​ చెప్పినోళ్లకే బీజేపీ టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు.