
హైదరాబాద్ సిటీ, వెలుగు: అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలికను మోసగించి అత్యాచారం చేసిన కేసులో ఓ యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 21 ఏళ్ల జనపాల అఖిల్ ఓ మైనర్ ను మోసగించి, గర్భవతిని చేశాడు.
పోక్సో కింద కేసు నమోదు చేసి చాదర్ఘట్ పోలీసులు నాంపల్లి మెట్రో పొలిటన్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 18 మంది సాక్షులను విచారించిన కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా, బాధితురాలికి రూ.8 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.