ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు సమన్లు

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు సమన్లు

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో వచ్చే అక్టోబర్ నెల 4వ తేదీన విచారణకు హాజరు కావాలని నాంపల్లి ఎంఎస్ జె కోర్టు ఆదేశించింది. రేవంత్ రెడ్డితోపాటు టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా నాంపల్లి ఎంఎస్ జే కోర్టు సమన్లు జారీ చేసింది. 
ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జ్ షీట్ ను విచారణకు స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టింది. ఈడీ కేసులను విచారించే నాంపల్లి ఎంఎస్ జే కోర్టు రేవంత్ రెడ్డి, సండ్ర వీర వెంకటయ్యలతోపాటు సెబాస్టియన్, ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, వేం కృష్ణ కీర్తన్ కు సమన్లు జారీ చేసింది.