మైత్రి మూవీస్ తో కళ్యాణ్ రామ్‌‌ 19

మైత్రి మూవీస్ తో కళ్యాణ్ రామ్‌‌ 19

ఓ మంచి హిట్టు కోసం వెయిట్ చేస్తున్న కళ్యాణ్ రామ్‌‌కి ‘బింబిసార’ బ్లాక్‌‌ బస్టర్‌‌‌‌ సక్సెస్‌‌నిచ్చింది. ఆ జోష్‌‌లో చేతిలో ఉన్న మిగతా సినిమాల్ని సూపర్ స్పీడ్‌‌తో కంప్లీట్ చేస్తున్నాడు కళ్యాణ్‌‌. తన పంతొమ్మిదో సినిమాని మైత్రి సంస్థలో చేస్తున్నాడు. రాజేంద్రరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్. రీసెంట్‌‌గా గోవాలో ఒక షెడ్యూల్‌‌ జరిగింది.

దీంతో సినిమా చాలావరకు పూర్తయిపోయింది. ఇక ఒకే ఒక షెడ్యూల్ మిగిలుంది. దీన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు టీమ్ ప్రకటించింది. బ్రహ్మాజీ, సప్తగిరి, జయప్రకాష్, మాథ్యూ వర్గీస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది కాక కళ్యాణ్ ‘డెవిల్’ అనే మరో మూవీ కూడా చేస్తున్నాడు. నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అతను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌‌గా కనిపించనున్నాడు.