హైదరాబాద్: కరోనా దెబ్బకు సినిమా థియేటర్స్ మూతబడ్డ విషయం తెలిసిందే. ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. దీంతో నష్టాలను తప్పించుకునేందుకు పూర్తయిన సినిమా నిర్మాతలు ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈ వరుసలో బాలీవుడ్ ముందుంది. అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబో సినిమా అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. విద్యాబాలన్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన శకుంతలా దేవి కూడా ప్రైమ్లోనే రిలీజైంది. తాజాగా మరికొన్ని బడా బాలీవుడ్ మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదల కావడానికి రెడీగా అవుతున్నాయని సమాచారం.
టాలీవుడ్ నుంచి కూడా కొన్ని చిన్న చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. రీసెంట్గా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య నెట్ఫ్లిక్స్లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా మరో తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్ను కన్ఫార్మ్ చేసుకుంది. నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన ‘వీ’ సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ కానుంది. తన 25వ సినిమా అయిన వీ విడుదలపై ట్విట్టర్లో నాని క్లారిటీ ఇచ్చాడు. ‘వేట కొనసాగుతోంది. సెప్టెంబర్ 5న ప్రైమ్లో వీ రాబోతోంది. ఇప్పుడు వేట, థియేటర్స్ ఓపెన్ అవగానే టక్ జగదీష్ ఆట’ అంటూ నాని ఓ లెటర్ను పోస్ట్ చేశాడు,