జగన్ చూసి కేసీఆర్ నేర్చుకోవాలి
వందసార్లు జగన్ కాళ్లకిందనుంచి దూరినా కేసీఆర్ కు బుద్ధిరాదు
ఫిరాయింపులపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు
ఫిరాయింపు రాజకీయాలపై తీవ్రమైన విమర్శలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నమ్మకంతో జనాలు గెలిపిస్తే.. ప్రజల నమ్మకాన్ని అమ్మి ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఫైర్ అయ్యారాయన. పార్టీ మారిన ఎమ్మెల్యేలు … తల్లిదండ్రులు, పెళ్ళాం పిల్లలను కూడా అమ్ముతారు జాగ్రత్త గా ఉండండి అని అన్నారు నారాయణ.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేర్చుకోవాలని అన్నారు నారాయణ. 100 సార్లు జగన్ మోహన్ రెడ్డి కాళ్ళ కింది నుండి దూరినా కేసీఆర్ కు బుద్ది రాదన్నారు. బీజేపీ కూడా వెస్ట్ బెంగాల్ లో ప్రభుత్వం లేకుండా చేయాలని చూస్తోందన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని చూసిన చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని అన్నారు. కేసీఆర్ వంటింటి కుందేలు MIM ప్రతిపక్షం అయితే ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.
ఫిరాయింపులపై సీపీఐ నిరసన
ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపులను ప్రోత్సహించడాన్ని నిరసిస్తూ GHMC AITUC ఆఫీస్ నుంచి నిర్వహించిన అర్ధనగ్న ర్యాలీలో నారాయణ పాల్గొన్నారు. మాజీ ఎంపీ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కమిటీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.