కరీనా కపూర్​ పట్టించుకోలేదు.. ఇన్ఫోసిస్​ కో ఫౌండర్​ నారాయణమూర్తి

కరీనా కపూర్​ పట్టించుకోలేదు.. ఇన్ఫోసిస్​ కో ఫౌండర్​ నారాయణమూర్తి

బాలీవుడ్​ నటి కరీనా కపూర్(Kareena Kapoor)​పై ఇన్ఫోసిస్​ కో ఫౌండర్​ నారాయణమూర్తి(Narayana Murty) షాకింగ్​ కామెంట్స్​ చేశారు. తన పక్క సీటులో కూర్చున్న కరీనా కపూర్​ అభిమానులు పలకరించడానికి వస్తే పట్టించుకోలేదన్నారు. ఎవరైనా వ్యక్తులు మనల్ని అభిమానిస్తుంటే తిరిగి ఏ రూపంలోనైనా వారిని ప్రేమించాలని ఆయన అన్నారు. 

ఇందుకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ ఒకటి వైరల్​గా మారింది. పక్కనే ఉన్న ఆయన సతీమణి సుధామూర్తి మాత్రం కరీనాకు మద్దతుగా నిలవడం విశేషం. ‘కరీనా మనలాంటి వ్యక్తి కాదు. మనకు 10 వేల మంది ఫ్యాన్స్​ ఉంటే.. ఫిలింస్టార్​ అయిన తనను ఆరాధించేవారు కోట్లలో ఉంటారు. 

వారందరినీ పలకరించడం అన్నిసార్లు సాధ్యం కాదు కదా’ అంటూ ఆమె బదులిచ్చారు. దీంతో ఆ కార్యక్రమంలో నవ్వులు విరిసాయి. వీరిద్దరి సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.