
మాదాపూర్, వెలుగు: టీజీ యాంటీ నార్కోటిక్బ్యూరో పబ్లపై నిఘాపెట్టి16 మంది గుర్తించి డ్రగ్స్టెస్టులు చేసింది. ఇందులో ఇద్దరికి పాజిటివ్రాగా.. వారిని మాదాపూర్పోలీసులకు అప్పగించింది. టీజీ యాంటీ నార్కోటిక్స్బ్యూరో, మాదాపూర్పోలీసులు తెలిపిన ప్రకారం.. డ్రగ్స్, గంజాయి తీసుకునే వారిపై కొద్ది రోజులుగా నిఘా పెట్టారు. మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లోని పబ్ ల్లో డ్రగ్స్తీసుకుంటున్నారనే పక్కా సమాచారంతో 16 మందిని టీఎన్యాంటీ నార్కోటిక్బ్యూరో అధికారులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. వీరికి 12 ప్యానెల్అబాట్యూరిన్టెస్టింగ్కిట్తో టెస్టులు చేశారు.
జూబ్లీహిల్స్కు చెందిన ఫేమస్ డీజే ప్లేయర్ సిద్ధార్థ్, మాదాపూర్గఫూర్నగర్కు చెందిన స్వరూప్కొకైన్, గంజాయి తీసుకుంటున్నట్లు నిర్ధారణ అయింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. డ్రగ్స్సప్లై చేసే వారికి దూరంగా ఉండాలని టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు సూచించారు. స్కూల్స్, కాలేజీల్లో ఎవరైనా డ్రగ్స్తీసుకున్నట్లు అనుమానం వస్తే యాంటీ డ్రగ్స్ కమిటీలు స్థానిక పోలీసులకు లేదా టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులకు తెలిపాలని పేర్కొన్నారు.