న్యూఢిల్లీ: వచ్చే రెండు, మూడేండ్ల పాటు లోకల్ వస్తువులను ప్రోత్సహించాలని, వాటినే కొనాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. ‘‘ఇక్కడే తయారైన, మన వాళ్ల చేతుల్లో రూపుదిద్దుకున్న వస్తువులనే కొనుగోలు చేయాలి. మనం కొనడమే కాదు వాటిని కొనేలా ఇతరులను కూడా మోటివేట్ చేయాలి. దీనికి ఎక్కువ కాలం తీసుకోవద్దు. 2022వ సంవత్సరం వరకు.. అంటే 75వ ఇండిపెండెన్స్డే పూర్తయ్యే వరకు ఈ పని చేస్తే చాలు’’అని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆల్ఇండియా రేడియోలో 2019లో తన చివరి ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ మాట్లాడారు. స్వదేశీ, మేక్ ఇన్ ఇండియా వస్తువులను ఎంకరేజ్ చేసే పనిని కేంద్ర ప్రభుత్వం ఒక్కటే చేయలేదని, దేశవ్యాప్తంగా యువత ముందుకొచ్చి చిన్న చిన్న ఆర్గనైజేషన్లు పెట్టాలని, జనాన్ని మోటివేట్ చేసి, వాటి గురించి వివరించి, కొనేలా చేయాలని కోరారు. పేదరికంలో మగ్గుతున్న వారికి చేయూ త అందించేందుకు ఈ పని చేయాలన్నారు. గాంధీజీ వందేండ్ల క్రితమే ఇండియన్ ప్రొడక్ట్లను ప్రమోట్ చేసే ప్రోగ్రాం ప్రారంభించారని, ఇప్పుడు ఆయన చూపిన దారిలో మనం నడవాలని చెప్పారు. తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో లోకల్ ప్రొడక్ట్లను ప్రమోట్ చేయాలని కోరానని, ఇప్పుడు మరోసారి అదే విజ్ఞప్తి చేస్తున్నానని ప్రధాని మోడీ చెప్పారు.
యూత్ ప్రశ్నిస్తోంది
‘‘సిస్టమ్ను యూత్ నమ్ముతోంది. దానిని ఫాలో అయ్యేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఒకవేళ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే దానిని వాళ్లు తేలికగా తీసుకోవడం లేదు. ధైర్యంగా అడుగు ముందుకేసి నిలదీస్తున్నారు. ప్రశిస్తున్నారు. ఇదో గొప్ప లక్షణంగా నేను భావిస్తున్నాను. రాబోయే దశాబ్దం యూత్దే”అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. వచ్చే దశాబ్దంలో మోడ్రన్ ఇండియా నిర్మాణంలో యంగ్ ఇండియానే కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నట్టు
మోడీ చెప్పారు. దేశ అభివృద్ధిలో వారి తోడ్పాటు ఎంతో ఉంటుందన్నారు. అరాచకత్వం, అశాంతిని యూత్ ద్వేషిస్తున్నారని యూత్పై మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. కులతత్వం, బంధుప్రీతి, పక్షపాతం, జెండర్ డిస్క్రిమినేషన్ మొదలైన వాటిని నేటి యువత వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్( సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)కు వ్యతిరేకంగా పలు యూనివర్సిటీల క్యాంపస్ల్లో హింస, ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేశారు.