
నర్సంపేట/ నల్లబెల్లి, వెలుగు: అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్3, 6, 7, 17, 19, 22, 24 వార్డులతోపాటు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదోడి సొంతింటి కళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు.
కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టీపీసీసీ మెంబర్ పెండెం రామానంద్, టౌన్ ప్రెసిడెంట్బత్తిని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నల్లబెల్లి, దుగ్గొండి మండలలాల్లో ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. దుగ్గొండిలో పీజీతండా, మందపల్లిలో తోకల శ్రీనివాసరెడ్డి ముగ్గుపోశారు.