
గండిపేట, వెలుగు: డ్రగ్స్ అమ్ముతున్న యువతిని సైబరాబాద్ ఎస్వోటీ, నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ లక్ష్మి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం నార్సింగిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కోకాపేటకు చెందిన లావణ్య వద్ద డ్రగ్స్ను గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఆమె దగ్గరి నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ ప్యాకెట్లతో పాటు సెల్ ఫోన్, ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు. లావణ్య గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సిటీలో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఆమెపై కేసు నమోదు చేసి ఉప్పర్పల్లి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. అనంతరం ఆమెను రిమాండ్కు తరలించారు.