
2024 నాటికి చంద్రునిపైకి వ్యోమగాలను పంపనున్నట్లు నాసా ప్రకటించింది. ‘మిషన్ టు మూన్’గా పేర్కొన్న ఈ ప్రాజెక్టు కోసం 28 బిలియన్ డాలర్లు ఖర్చుకానుందని నాసా అధ్యక్షుడు జిమ్ బ్రిడెన్స్టైన్ తెలిపారు. ఇద్దరు వ్యోమగాముల్లో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.