అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకూ పొంచి ఉన్న ప్రమాదం : నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకూ పొంచి ఉన్న ప్రమాదం : నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం అయిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవటంపై.. స్వయంగా పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ  అథారిటీ.. తన నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసింది. తన రిపోర్టులో కొన్ని ప్రధానమైన అంశాలను ప్రస్తావించింది కమిటీ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

>>> మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ, కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ అంశాల్లో ప్రభుత్వం విఫలమైంది.
>>> ప్లానింగ్ ప్రకారం డిజైన్ జరగలేదు.. రూపొందించిన డిజైన్ ప్రకారం నిర్మాణం జరగనేలేదు
>>> డ్యామ్ నిర్వాహకులు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలను, నిర్మాణాలను సరిగా పరిశీలించనేలేదు. నాణ్యత లోపించింది. 
>>>  డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే.. మేడిగడ్డ బ్యారేజీ క్రమంగా బలహీనపడింది. 
>>>  బ్యారేజీ నిర్మాణాలను తనిఖీ చేయాలంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినా పెడచెవిన పెట్టింది. హెచ్చరికలను బేఖాతర్ చేసింది. 
>>>  డ్యామ్ సేఫ్టీ యాక్ట్(2021) నిబంధనలను ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించింది. ఇది ఘోర తప్పిదంగా చెప్పొచ్చు. 
>>> రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం వల్ల ప్రజల జీవితాలకు, ఆర్దిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదం కలిగే అవకాశం ఏర్పడింది.
>>> మేడిగడ్డ బ్యారేజీలోని ఒక బ్లాక్ లో తలెత్తిన సమస్య వల్ల.. మొత్తం బ్యారేజీ సక్రమంగా పని చేయని దుస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించడానికి అవకాశమే లేదు.
>>> బ్యారేజీలోని బ్లాక్ నెంబర్ 7లో నెలకొన్న సమస్యను మరమ్మతులతో పరిష్కరించటానికి.. వీలు లేకుండా పోయింది. ఆ బ్లాక్ మొత్తాన్ని పునాదుల నుంచి తొలగించి.. మళ్లీ పునర్ నిర్మించాల్సిందే.
>>> మేడిగడ్డ బ్యారేజీలోని ఇతర బ్లాక్ లు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మొత్తం బ్యారేజీనే పునర్ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి తీవ్రం కాకముందే బ్యారేజీని పునరుద్దరించాలి.
>>> అంతవరకు రిజర్వాయర్ లో నీటిని నింపకూడదు. హెచ్చరికలు పట్టించుకోకుండా నీటిని నింపితే.. పైపింగ్ సమస్య ఏర్పడి ప్రజలకు నీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడుతుంది.
>>> కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం బలహీనంగా ఉన్నాయి. ఈ బ్యారేజీల్లోనూ మేడిగడ్డ తరహాలో సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం నెలకొంది.
>>> అన్నారం బ్యారేజీ దిగువన బాయిలింగ్ సమస్య సంకేతాలు కనిపిస్తున్నాయి.
>>> తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మేడిగడ్డ బ్యారేజీతోపాటే యుద్ద ప్రాతిపదికన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలి.

ALSO READ :- Kitchen Tips : వేపుడులు కరకరలాడాలి అంటే.. ఇలా చేయండి