నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 52.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా పూర్తికాల బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కనీసం 65 శాతం తక్కువ కాకుండా మార్కులతో (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 శాతం) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్– 2025)కు హాజరై, చెల్లుబాటు అయ్యే గేట్–2025 స్కోరును కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 15.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: మే 29.
సెలెక్షన్ ప్రాసెస్: గేట్–2025 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ careers.ntpc.co.in ను సందర్శించండి.
